తరతరాల మహిళా స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసింది... ఇరాన్లో అడుగం టిన మహిళల హక్కుల కోసం ఆమె తన గళమెత్తింది... లక్ష్యసాధనకోసం లాయర్గా మారింది... తనని నమ్ముకున్న తోటి మహిళల కోసం జర్నలిస్ట్గా మారి తన కలాన్ని ఖడ్గంలా ఝుళిపించింది... పాలకుల దమననీతిపై సంకుల సమరం సాగించి మతఛాందసవాదులనుంచి ప్రాణాలకు ముప్పువుందని తెలిసినా మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తోంది... అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఇరాన్ మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. ఇప్పుడు ఆమె ఒక వ్యక్తి కాదు... లక్షలాది ఇరాన్ మహిళలపాలిట ఆశాజ్యోతి... మహిళా స్వేచ్ఛపై మారుమోగిస్తున్న ఒక సంగ్రామ భేరి...ఆమే ఇరాన్ షేర్ని షాదిసహర్...
మహిళల కోసం...
మహిళా హక్కుల కోసం ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వక ఆచర ణలో పెట్టి చూపించింది. చదువుకునే రోజుల్లో తన మిత్రురాళ్లతో అన్న మాటలను నిజంచేసి చూపింది. కేవలం తన ఒక్కదాని వలన ఉద్యమం బలోపేతం కాదని తెలుసుకుంది... తనతో పాటు సరిసమానంగా పనిచేసే కొంద రు టీమ్ను తయారుచేసుకుంది. ‘రోహి’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. లాయర్గా పేదవారికి ముఖ్యంగా మహిళలకు సంపూర్ణ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆమె తన జీవన గమనాన్నే మార్చేసుకుంది. ఆమె స్థాపించిన రోహి సంస్థ ద్వారా ఇప్పటికే ఇరాన్లో అనేక మంది మహిళల తరపున డిఫెన్స్ లాయర్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కేసులను వాదించింది. చాలా కేసుల్లో విజయం సాధించింది.
స్వచ్ఛంద వెబ్సైట్...
మహిళల కోసం షాదిసహర్ ఏకంగా ఒక వెబ్సైట్నే ఆరంభించింది. ఆన్లైన్ ద్వారా వారి సమ స్యలను ఉచితంగా పరిష్కరిస్తోంది. ఉమెన్ ఇన్ ఇరాన్ అనే వెబ్సైట్ ఇప్పటికే ఆ దేశంలో బాగా పాపులర్ అయింది. దేశంలో ఏ మూల ఉన్నా మహిళలు ఈ వెబ్సైట్ ద్వారా షాదిని ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా...పరోక్షంగా తమకు న్యాయం కలిగేలా చూసుకుంటున్నారు. ఇరాన్ లో అనేక మతఛాందస సంస్థలు ఇప్పటికే షాదిపై ఓ కన్నేశాయి. షాది ప్రాణాలకు ముప్పు ఉన్న దని తెలిసినా ఆమె ఏనాడూ తన ప్రాణాలకోసం అల్లాడలేదు. 2003 సంవత్సరంలో ఇరాన్లో సంభవించిన ఘోరమైన భూకంపంలో అనేక ప్రాంతాలు నేలమట్టం అయిపోయాయి. వెంటనే స్పంది ంచిన షాది అప్పటికప్పుడే నిధులు సేకరించి ఒక్కరోజులోనే ఆ ప్రాంతానికి చేరుకుంది.
అక్రమ అరెస్ట్లు...
2009 జూన్ 14వ తేదీన ఆమెను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించింది. మహిళా హక్కుల కోసం పోరాటం సాగిస్తున్న శివనజర్ అహ్రి తరపున షాది డిఫెన్స్ లాయర్గా వాదించిన నేరానికి షాదిపై అక్రమ నేరం మోపి అరెస్ట్ చేయించింది ప్రభుత్వం. 2007లో కూడా షాదితో సహా 33 మంది మహిళలు అరెస్ట్ అయ్యారు. కేవలం వారు చేసిన నేరం ఏమిటంటే అక్కడి మతాచారాలకు విరుద్ధంగా వారంతా సాధారణ సివిల్ దుస్తులు ధరించి ముస్లింలు ప్రార్థనలు జరుపుకునే మసీదు ముందరనుంచి వెళ్లడం... దీంతో అక్కడ కొందరు మతవాదులు వారిని వెంబడించి తరిమారు. దాదాపు షాదిపై హత్యా యత్నం జరిగింది. ఇంత జరిగినా ప్రభుత్వం చీమకుట్టినట్టు కూడా స్పందించక షాదినే ముస్లిం మహిళలను రెచ్చగొడుతోందని... మత సంప్రదాయాలను ధిక్కరించినందుకు, ఉద్రేకపూర్వ కప్రసంగాలు చేస్తున్నందుకు ఆమెపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించింది ప్రభుత్వం.
జర్నలిస్ట్గా...
షాదిసహర్ లాయర్ మాత్రమే కాదు... మహిళా హక్కుల కోసం నినదించిన జర్నలిస్ట్. ఆది నుంచి ఆమెలో రగులుతున్న కసే ఆమెను జర్నలిస్ట్గా మార్చింది. మహిళా సమస్యలపై అనే క ఆర్టికల్స్ ఆమె వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. ఇది కేవలం మహిళలను అవగాహన కల్పించడానికి తప్ప పేరుప్రఖ్యాతల కోసం కాదని ఆమె అనేవారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ ఈ దేశపు మహిళ కోసం... అణిచివేయబడిన వారి హక్కుల కోసం నిరంతర పోరాటం సాగిస్తునే ఉంటానంటారు.
-హైమ సింగతల
Surya telugu daily
No comments:
Post a Comment