Search This Blog

Thursday 14 August 2014

అడవిని కాపాడే ఆకుపచ్చని మహిళా దళం...

వంట చేయడం, పిల్లలను చూసుకోవడం, కుటుంబ పోషణ కోసం పని చేయడం ఇవన్నీ మహిళల సాధారణ జీవనంలో భాగం.. ఉదోగ్యాలు చేసే వారైనా కుటుంబ అవసరాలను చూడక తప్పదు.. కానీ బంగ్లాదేశ్‌ గిరిజన మహిళలు ఇందుకు భిన్నం. పనులన్నీ ముగించిన తరువాత వారో రక్షక దళం..ఆకుపచ్చని చీరలు కట్టుకుని.. తలపై టోపీ.. చేతిలో కర్రలు పట్టుకుని అడవిని ధ్వంసం చేసే వారి భరతం పట్టేందుకు బయల్దేరుతారు... అడవికి హాని కలిగించే వారి మెడలు వంచి పోలీసులకు అప్పజెపుతారు. 

dilwara1ఒక చిన్న ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది అని వ్యాపార ప్రకటన వీరి విషయంలో నిజం అనిపిస్తుంది.ఒకప్పుడు అడవిలో కట్టె లు సేకరించి, అక్కడి జంతువులను వేటాడి తమ జీవనాన్ని సాగించే వీరంతా నేడు దాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తు న్నారు. వేటను విడిచి పెట్టి పశువుల పెంపకం, పాల వ్యాపారం వం టివి చేస్తూ అటవీ ప్రాంతాన్ని కాపాడటంలో తమ వంతు బాధ్యత వహిస్తున్నారు. ఇంకా ఏ కాస్త సమయం దొరికినా తమ తోటి వారికి అడవి వలన కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఇంత చేస్తున్న వీరంతా నిరక్షరాస్యులు..ఆధునిక నాగరికతకు దూరంగా బతుకుతున్న గిరిజన మహిళలు. 

బంగ్లాదేశ్‌లోని దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతో నిండిపోయి వుంటుంది. అనేక రకాల జంతువులు, పక్షులకు ఇవి ఆవాసాలుగా వున్నాయి. ఈ అడవినే జీవనాధారం చేసుకుని అనేక తెగలు కూడా అక్కడికి దగ్గరిలోని పరిసర ప్రాంతాల్లో నివాసం వుంటున్నాయి. అడ వి ఉత్పత్తులను సేకరించడం, వేట, కర్రల సేకరణ వంటివి ఇక్కడి గిరి జనుల నిత్య జీవనంలో భాగం. వీరితో పాటు అడవిలోని పురాతన చెట్లను నరికి అక్రమంగా రవాణా చేసేవారు ఎక్కువయ్యారు. దీంతో క్ర మంగా అటవీ ప్రాంతం తరిగిపోవడాన్ని గమనించిన ప్రభుత్వాలు వాటి రక్షణకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఏదీ ఫలించ లేదు. 

dilwaraచివరికి 2008లో స్థానిక ప్రభుత్వం జర్మనీకి చెందిన జిటిజెడ్‌ (పర్యావరణాన్ని రక్షించేందుకు ఏర్పాటు చేసిన జర్మనీ సంస్థ), అమె రికాకు చెందిన యుఏఎస్‌ఏడి ద్వారా కొత్త పథాకాన్ని ప్రవేశ పెట్టింది. 13 మిలియన్లతో దీనికి శ్రీకారం చుట్టింది. స్థానికుల సూచనల మేరకు గిరిజన మహిళలను ఇందులో భాగస్వాములను చేసింది. అ డవికి రక్షణ కల్పించేందుకు వారే సరైన వారిగా ఎంపిక చేసింది. ఈ ఆలోచన అక్కడి అడవి తీరునే మార్చేసింది. దీనితోపాటే మహిళల అభివృద్ధికి కూడా చేయూత నిచ్చింది. 

రక్షక దళ అవతరణ...
ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత అక్కడి మహిళలంతా కలి సి ఆకుపచ్చని చీరలు కట్టుకుని..చేతిలో కర్రలు తీసుకుని అడవిలో కలియ తిరుగుతారు. అడవికి నష్టం కలిగించే వారిని ఎదిరించి పోరా డతారు. మూడేళ్లుగా తమతోపాటు అడవిలో నిత్యం తిరుగుతు న్న ఈ మహిళలను అక్క డి చెట్లు కూడా గుర్తిం చినట్లే ప్రవర్తి స్తాయని రక్షక దళంలోని మహి ళలు చెబుతున్నారు. ‘అడవి రక్షకులుగా’ పేరు పొందిన ఈ చీ రల స్వ్కాడ్‌ అడవిలో రేంజర్లతో పాటు కలిసి మొత్తం అడవిని కాపా డుకుంటున్నారు.

jungleసదన్‌ అడవుల్లోని కొండల్లో చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్ళే వాళ్లు తమ అడవికి ఎటువంటి హానీ కలిగించ కండి అంటూ విన్న విస్తున్నారు. ఈ దళం అడవికి కాపలా కాయడం మొదలు పెట్టిన తరువాత అక్కడ చెట్లు నరకడం చాలా వరకు తగ్గి పో యింది. అనేక వణ్యప్రాణులు కొత్తగా అడవికి చేరుతున్నాయి. ఇప్పు డు అంతా పచ్చగా కళకలలాడుతోంది.ఏనుగులు, కోతులు, జింకల రక్షణకు ప్రత్యేక స్థావరాలు కూడా ఏర్పాటు చేశారు.దీనితో పాటే త మ ప్రాంతాలను వన్య మృగాల నుండి కాపాడుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఏనుగులు తమ ప్రాంతాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేయకుండా వాటిని ఓ ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసి వా టికి ఆహార వసతులను కల్పిస్తున్నారు. దీనికి ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఇది విజయవంతం కావడంతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 

ప్రత్యామ్నాయ జీవనాధారం వైపు...
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే మహిళలకు ప్రభుత్వం ప్రత్యా మ్నాయ సదుపాయాలను కల్పించింది.పాడి, పశువుల పెంపకం, కో ళ్ల ఫారం వంటివి ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం అంది స్తోంది. వీరి శ్రమకు 50 డాలర్లను అందిస్తోంది. ఇది నామమాత్రం అయినప్పటికీ అక్కడి మహిళలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా రు. ఏ కాస్త సమయం దొరికినా తోటి వారికి కూడా అడవిలో వేటా డటం వంటివి మానుకొమ్మని చెబుతున్నారు. కలిగే లాభాలను వివరి స్తున్నారు. అలా ముందుకొచ్చిన వారికి ఉపాధి కల్పించాలని ప్రభు త్వానికి విన్నవిస్తున్నారు. రోజ్‌గార్‌ యోజనా వంటి పథకాల ద్వారా ఇప్పటి వరకు ఇలాంటి వారెందరికో ఉపాధి కల్పించేలా చేశారు. 

మేమంటే వారికి భయం... 
jungle1‘మేము ఆకుపచ్చని చీరలు కట్టుకుని అడవిలో తిరుగు తుంటే చాలా మంది మమ్మ ల్ని చూసి భయపడుతున్నా రు. దాక్కుంటున్నారు. కాని అక్కడి ఆనుపానులన్నీ తెలి సిన మాకు వాళ్లని పట్టుకో వడం చిటికెలో పని. అందు కే ఎక్కువగా ఇప్పుడు చెట్ల ను నరికేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు’ అని రక్షకదళం సభ్యురాలు దిల్వారా చెబుతోంది. 

ఇంకా చేయాల్సింది చాలా వుంది..
ఇక్కడి తెగకు నాయకత్వం వహించే అమిన్‌ ఖాన్‌ ఒక ప్పుడు జీవన భృతి కోసం అడవిలో వేటాడేవాడు.దా నిద్వారా వచ్చే దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు మహిళలను చూసి ఆయన కూడా మారి పోయాడు. ప్రభుత్వానికి సాయం చేస్తున్నాడు. అడవి రక్షణలో తన వంతుగా ఇతరులకు వివరిస్తున్నాడు.‘ప్రభుత్వం ఏదై నా ప్రత్యామ్నాయం కల్పించినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది.ఇప్పుడు అదే జరిగింది. దీని కన్నా ముందు చాలా పథకాలు తెచ్చారు కానీ అవేవీ ఫలితాల నివ్వ లేదు. ఏ ప్రాంతం అభివృ ద్ధి చెందాలన్నా అక్కడి స్థాని కులను భాగస్వాములను చేసుకుంటేనే ఫలితం దొరు కుతుంది అనేదిప్పు డు రుజు వయ్యింది. దీని తోపాటే అడ విని తిరిగి పెం చేందుకు కూ డా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అంటున్నారు.

ఇది మా అదృష్టం...
dilwara2‘ప్రభుత్వం మమ్మల్ని భాగస్మాలను చేసుకోవడం మా అదృష్టం. అడ విని కాపాడుకుంటేనే మా జాతిని కూడా కాపాడుకోగలం. లేదంటే అడవితో పాటే మా తెగ కూడా అంతరించి పోయేది. మా పిల్లల కోసం కూడా మేము ఇప్పుడు ఈ పని చేస్తున్నాం. ఇది వరకు ఇక్కడ పాఠశాలలు ఏవీ లేవు. కానీ మా పిల్లలు వెళ్తున్నారు’ అని మహిళా దళ సభ్యురాలు హోసనేరా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

అడవిని విస్తరించే ప్రయత్నం...
ప్రస్తుతం అడవి మొత్తం 77 కిలోమీటర్ల మేర విస్తరించి వుంది. దీన్ని కాపాడటంతో పాటు కొత్తగా చెట్లను నాటేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. దీనికి కూడా మహిళల భాగస్వామ్యాన్నే కోరింది. 70 శాతం రక్షణకు 30 శాతం తిరిగి ఆడవిని పెంచేందుకు కేటాయి స్తున్నారు. పక్షి జాతులను, జంతుజాలాన్ని రక్షించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ అన్ని పనుల్లోనూ మహిళలదే భాగ స్వామ్యం. వారి రాకతోనే తమ పథకాలన్నీ వాస్తవ రూపం దాల్చుతు న్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. చెట్లను తిరిగి నాటే ప్రయత్నంలో వారు మహిళల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు. 


- హైమ సింగతల
March 16, 2011

No comments:

Post a Comment