హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటాలు ఓ వైపు.. పురుషాహంకార ధోరణులతో నలిగిపోతూ మరోవైపు.. అన్ని రంగాల్లో సమాన బాధ్యతలు నిర్వహిస్తున్నా సమాన విలువలు మాత్రం కరువు...వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు, కట్టుబాట్లు చుట్టూ ముళ్ల కంచెల్లా మారి అడ్డుకుంటున్నా ప్రగతి బాటలో పయనించేందుకు వేస్తున్న అడుగులు.. ప్రపంచం మొత్తం 101వ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నా రోజు రోజుకు ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో తలమునకలైపోయింది నేటి మహిళ. అటువంటి మహిళ ఎదుర్కొంటున్న, ఎదురీదుతోన్న సమస్యలపై, వారు సాధించిన విజయాలపై ‘ధీర’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
వేడుకల సమయం కాదు..
ఈ మహిళాదినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. వందేళ్లు దాటి నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చరిత్రలో ఎంతమంది మహిళలు ఎన్ని ఉన్నత పదవులు సాధించారనేదీ గుర్తించాలి.వాస్తవానికి అన్ని ఉద్యమాల్లో మహిళల పాత్ర సమానంగా ఉన్నప్పటికీ రావలసిన గుర్తింపు రాలేదు. రాలేదు కాదు రాకుండా చేశారు. స్వాతంత్ర పోరాటం మొదలు ఇటీ వలి అన్ని ఉద్యమాల్లోనూ మహిళలూ సగం అన్న విషయం మరుగున పడేశారు. అందుకే చరిత్రను తిరిగి రాసుకోవాలి. స్ర్తీల హక్కుల కోసం, వారిని అక్షరాస్యులుగా చేయడం కోసం ఉద్యమించిన సావిత్రిబాయి పూలేను గుర్తించిన వారు లేరు. ఇలా చెప్పుకుంటు పోతే ఇంకా అనేక సంవత్సరాలు వెనకకు మహిళలు వెళ్లిపోయారు.
అందుకే వనిత గొంతు ఇంకా విన పడాల్సి ఉంది. నేడు మహిళాదినోత్సవం అంటే అంటే పండగ కాదు.ఇది పోరాటదినం అనే విషయాన్ని గుర్తించాలి. చరిత్ర నిర్మాతలుగా నిరూపించుకోవాలి. అప్పుడే నిజమైన మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోగలం. ఉన్న చట్టాల్ని సరిగ్గా వినియోగించుకోలేనపుడు కొత్త చట్టాలు ఎన్ని వచ్చిన వ్యర్థ మే. చట్టాలు తెలియాలంటే చదువు పెరగాలి. మహిళలు తల్లి, కూతురు, భార్యగానే కాదు మగవారితో సమానంగా తాము సమాజంలో పౌరులుగా బాధ్యత వహించాలి.
నిలువెల్లా దాడుల గాయాలతో...
ప్రేమిస్తున్నామంటూ ప్రాణాలు తీస్తున్నా నమ్మి వారికి బలి అవుతున్న అమాయకురాళ్లు ఎందరో నేరాల సంఖ్యకు సాక్షు లుగా నిలిచారు. గతేడాది మన రాష్ట్రంలో ఆడవారిపై నేరాల కు సంబంధించి నమోదైన కేసుల సంఖ్య 1,68,191. దాడు లకు సంబంధించి 21,436. వీటిలో 1,147 అత్యాచారాలు. ఇక మిగి లినవి జిల్లాల వారీగా నమోద య్యాయి. హైదరా బాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మహిళలపై దాడుల కేసులు 1,622. ప్రతి గంటకు కనీసం ముగ్గురు మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు రాష్ట్ర నేర నమోదు విభాగం స్పష్టం చేస్తోంది.
ప్రతి రెండు నిమిషాలకు ప్రపంచం మొత్తం మీద ఒక మహిళ అత్యాచారానికి గురి అవుతోంది. దీనిని బట్టే ఆడవారిపై పెరిగిపోతున్న నేరాలు అంచనా వేసుకోవచ్చు.గతంతో పోల్చితే ఈ రేటు మహిళలపై దాడుల కేసులు గతం తో 7 శాతం పెరిగాయి. ఇది దిగ్భ్రాంతికి గురిచేస్తున్న అంశ మే అయినా వాస్తవం. గృహహింస, కట్నాల కేసులు ఇవన్నీ సర్వసాధారణమైన అంశాలు. చట్టాలు మాత్రం తీసుకొచ్చేం దుకు ప్రయత్నాలు చేయగలం. కానీ వాటినుండి తప్పించు కునేందుకు ఎదుటి వారు చేసే ప్రయత్నాలను కూడా పసిగట్టి అడ్డుకట్ట వేసే స్థాయికి మాత్రం మహిళలు చేరుకోలేదు.
చట్టసభల్లో రిజర్వేషన్ కోసం..
దేశంలో ఒక రాష్టప్రతి, ఒక ముఖ్యమంత్రి, పార్లమెం ట్ స్పీకర్, నగర మేయర్ ఇలా ఎన్ని స్థానాల్లో మహి ళలు వున్నా వీరిని చూసి సంబర పడేందుకు లేదు. తల్లులుగా, భార్యలుగా కుటుంబాలను తీర్చిదిద్దే వారు దేశ దశ, దిశను నిర్దేశించడంలో బాధ్యతా యు తంగా ఉండగలరు. క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థలలో 33శాతం రిజర్వేషన్ అమలవుతున్నప్పటికీ అధికారం పురుషుల చేతిలో ఉన్నదన్న వాదన ఉంది. అయినప్పటికీ రాజకీయ సాధికారతను సాధించడం లో తొలఇడుగులుగా ఇవి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైంది మహిళలే కానీ వారి భర్తలు కాదు.
రాష్ట్రం లో స్వయం సహాయక బృందాలు ఆర్థికంగా సాధికారతను సాధించడమే కాక సామాజిక చైతన్యాన్ని పెంచే కార్యక్రమాలను సైతం చేపడుతుండడం ఒక గొప్ప విజయంగా భావించాలి. పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రతిపాదన దశాబ్దమున్నరగా నానుతోంది. కర్రవిరగదు, పాము చావదు చందంగా రాజకీయ పార్టీలన్నీ బిల్లును సమర్ధిస్తున్నట్టుగా మాటాడుతూనే దానిని ఆమోదం కాకుండా అడ్డు పడుతున్నాయి.1996లో యునెటెడ్ ఫ్రంట్ ప్రభు త్వంలో హెచ్.డి. దేవె గౌడ ప్రధానిగా ఉన్న సమ యంలో ఈ బిల్లును తొలు త ప్రతిపా దించారు. ఐ.కె. గుజ్రాల్ ప్రస్తుత రూపంలో ఉన్న ఈ బిల్లును ప్రవేశపె ట్టారు.
ఒకవేళ ఈ బిల్లు చట్టమైతే 543 మంది సభ్యులున్న పార్లమెంటులో దాదాపు 181 మంది మహిళలు తప్పనిసరిగా సభ్యులుగా ఉంటారు. తరువాత అనేకసార్లు దీనిని సభలో ప్రవేశపెట్టినప్పటికీ, మహిళా జనాభాలో సగభాగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల మహిళలకు ఉపకోటా కల్పిం చకుండా దీనిని ఆమోదించడానికి వీలులేదని కొన్ని పార్టీలు పట్టబట్టడంతో ఈ బిల్లు ఆమోదం పొంద లేదు. ఎక్కువ మం ది మహిళలు చట్ట సభలలో ఉంటే, అంటే విధాన నిర్ణేతలు గా ఉంటే దేశం దశ, దిశ మారిపోతాయనడంలో సందేమం లే దు. అభివృద్ధితో సమానంగా మహిళలు రాజ కీయ అవకా శాలు అందిపుచ్చుకోలేక పోతున్నారన్నది వాస్తవం. మహిళా బిల్లు ఆ లోటును పూర్తి చేస్తుందని మహిళా లోకంతో పాటు ప్రజా స్వామ్య శక్తులు కూడా ఆశిస్తున్నాయి.
విదేశాలలో సాధిస్తున్న విజయాలెన్నో...
మనదేశ మహిళలు ఎక్కడున్నా ముందుకు వెళ్ళగలరు అని నిరూపించుకుంటున్నారు. వారి విజయాల వెనుక ఈ దేశపు మట్టి సువాసన ఉందని వారు సగర్వంగా చెప్పుకుంటు న్నారు. వారిలో ఆసియా మేటి మహిళగా మోనిక పేరు గడించిం ది. ప్రజాసంబంధాల విభాగంలో మోనిక అందించిన సేవలకు ఉమెన్ ఆఫ్ ఎచీవ్మెంట్ అవార్డు దక్కింది. సౌత్కరోలినా రా ష్ట్ర గవర్నర్ ఎన్నికల్లో భారతీయ మహిళ నిక్కీ హెలీ విదేశాల్లో అత్యున్నత పదవి అయిన గవర్నర్ పదవిని చేజిక్కించుకుని విజయబావుటా ఎగురవేసింది. బాబీ జిందాల్ తరువాత ఆ పదవిని అందుకున్న రెండవ ఎన్నారైగా, తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోయింది.
భారత సంతతి మహిళా గీతా గోపినాథ్ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా నియ మితులై ఈ స్థానాన్ని పొందిన తొలి భారతీయ వనితగా వార్త ల్లో కెక్కారు. ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అయిన అమె రికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో భారతీయ సంతతి మహి ళకు తొలిసారిగా ప్రొఫెసర్ హోదా లభించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో తొలిసారిగా ఇద్దరు ప్రవాస భారతీయ మహిళలకు ఆ దేశ హౌస్ ఆఫ్ కామన్స్లోకి ప్రవేశం లభించింది. బ్రిటన్లోని ప్రవాస భారతీయ మైనారిటీలకు నేతృత్వం వహి స్తున్న ఈ ఇద్దరు మహిళలు ఆ దేశ సార్వత్రిక ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో విజయం సాధించి హౌస్ ఆఫ్ కా మన్స్లో అడుగుపెట్టారు.
ప్రవాస భారతీయ మహిళ ప్రీతి పటేల్ కన్జర్వేటివ్ పార్టీ తరుఫున బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్లో తొలిసారిగా అడుగుపెట్టారు. గే లేబర్పార్టీ అభ్యర్థి ఇండి యన్ ఆరిజన్ లేబర్ పార్టీ ఎంపీ కీత్వాజ్ సోదరి వలేరీ వాజ్ కూడా హౌజ్ ఆఫ్ కామన్స్కు ఎంపికయ్యారు. ప్రముఖ భార తీ య అమెరికన్, ఉద్యమకారిణి కమలా హ్యారిస్ కాలి ఫోర్ని యా అటార్నీ జనరల్ పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ గెలుచుకున్నారు.నామినేషన్ కోసం జరిగిన ప్రాథ మిక ఎన్ని కల్లో ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ కెల్లీ సహా ఆరు గురిని కమల ఓడించారు. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పె ల్లింగ్ బీ కాంపిటేషన్లో భారతీయ సంతతి బాలిక 83వ జా తీయ స్పెల్లింగ్బీ అనామిక విజయం సాధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే విదేశాలలో విజయాలు సాధిస్తున్న వారు ఎందరో మహిళలు.
దేశానికి రక్షణగా....
ప్రస్తుతం అమ్మాయిలు ఏ రంగంలోనూ వెనకడుగు వేయ డం లేదు. నింగి, నేల మాదేనంటూ ముందుకు దూసుకుపో తున్నారు. ఉద్యోగానికి, లింగభేదానికి ఉన్న రేఖను చెరిపేస్తు న్నారు. కార్పొరేట్ ఆఫీస్లో అధిక ఒత్తిడితో చేయగలిగే ఉన్న త పదవులైనా, శారీరంగా కష్టమైనా దేశ సరిహద్దు రక్షణ సైనికులుగానైనా సై అంటున్నారు. మగవారికి ధీటుగా చేయ గలమని నిరూపిస్తున్నారు. కేవలం వైద్య, సేవా, విద్య వంటి రంగాల్లో మాత్రమే మిలిటరీల్లో సేవలందించిన వారు పా రామిలటరీ ఇండో- టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)గా శిక్ష ణపొంది దేశానికి సేవ చేయడానికి ఎంపికయ్యారు.
వీరిలో చాలామంది చిన్న పట్టణాలకు చెందినవారు. చిన్న పట్టణాల్లో పుట్టినా వారి కల మాత్రం చిన్నది కాదు. ఆ స్వప్నాన్ని సాకా రం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడ్డారు. చట్టు పక్కల ప్రజలు మీకెందుకు ఆ పనులు వేరే ఉద్యోగంలో చేరవచ్చుగా అని నిరుత్సాహ పరిచినా తమ లక్ష్యాన్ని వదులుకోలేదు. ఇం డో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)గా శిక్షణ పొందారు. వీరు అంతర్జాతీయ సరిహద్దుల్లో, ఇతర క్లిష్టతరమైన ప్రాంతా ల్లో సేవలు అందిస్తున్నారు. వీరు నాతూ లా పాస్ అనే ప్రాం తం వద్ద భద్రతను పాటించాల్సి ఉంటుంది. భారత్, చైనాకు మధ్యగల క్లిష్టపరమైన ప్రాంతం అది. అయినా సరే దేశానికి రక్షణగా నిలిచేందుకు వారు సిద్ధమయ్యారు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతూ వారి ధైర్య సాహసాలు అనంతం.సుఖో య్లో పర్యటించిన అత్యంత ఎక్కువ వయసు కలిగిన తొలి మహిళ మన రాష్టప్రతి ప్రతిభాపాటిల్.
- హైమ సింగతల
(సూర్య దినపత్రిక ధీరలో March 8, 2011న వచ్చిన నా ఆర్టికల్)
No comments:
Post a Comment