జీవితాంతం కష్టనష్టాల్లో తోడుగా వుంటానంటూ ప్రమాణం చేసిన భర్త మరొకరిని పెళ్లిచేసుకున్నాడు.కట్టుబట్టలతో, చేతిలో కొడుకుతో ఒంటరి ప్రయాణం... దొరికిన పని చేసుకుని పొట్టగడుపుకుంటున్న తరుణంలో తల్లిమరణం. ముగ్గురు చెల్లెల్లు, తమ్ముడి బాధ్యత.. కొంత కాలానికే తండ్రి మరణం.... ఇది ఏదో సినిమా కథ కాదు.. ఓ పల్లెటూరి అమ్మాయి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు.. బాధల్లోనుండి మెరిసిన ఓ ‘భాగ్యం’ కథ.

కుటుంబానికి తోడుగా...
కుటుంబానికి తోడుగా వుండేందుకు పుట్టింటికి చేరింది. వున్న ఆరు ఎకరాల భూమిలో సాగు చేయ డంలో తండ్రికి సాయంగా నిలిచింది. ఆధునిక పద్ధతులను అవలంబించి లాభాలు గడించడం ప్రా రంభించింది.ఇందుకు ఆమె ఆకుకూరల సాగును ఎన్నుకుంది. ఆధునిక పద్ధతులైన డ్రిప్ ఇరిగేషన్, స్పింక్లర్ల ద్వారా వ్యవసాయాన్ని చేయడంలో ఎంత లాభం వుందో తెలుసుకుంది.
తండ్రి మరణం...
కుటుంబాన్ని ఓ దారిలోకి తెచ్చే సమయంలో మరో ఎదురు దెబ్బ. తండ్రి మరణం. దీంతో భారం మొత్తం భాగ్యం మీదే పడింది. ముగ్గురు చెల్లెల్లు. ఒక తమ్ముడు. అందరి బాధ్యతా ఆమెపైనే. ఆ కష్టాన్ని దిగమింగి తిరిగి తన బాధ్యతలను నిర్వర్తించడంలో నిమగ్నమైపోయింది.
తనకు తెలిసింది ఒక్కటే...

కుటుంబాన్ని ముందుకు నడిపింది...
భాగ్యం తన ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేసింది. తమ్ముణ్ని చదివిస్తోంది. తనకు తోడుగా వుండేందుకు కొడుకుకు వ్యవసాయంలో శిక్షణ ఇస్తోంది. ఇప్పుడు ఆమె కొడుకే ఆమెకు తోడు. తన కుటుంబాన్ని ముందుకు నడిపించడమే తన లక్ష్యం. వ్యవసాయమే ఆమె నేస్తం. బాధలనే భాగ్యంగా మలచుకున్న భాగ్యం ఓ స్ఫూర్తిప్రదాత.
-హైమ సింగతల
surya telugu daily January 5, 2011
No comments:
Post a Comment